ఆర్జీవీపై డీజీపీకి ఫిర్యాదు

by  |
ఆర్జీవీపై డీజీపీకి ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంపై ఆందోళనలు చేపడుతున్నాయి. రామ్ గోపాల్ వర్మపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారి నుంచి డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దళిత సంఘాలు ధర్నా చేపట్టాయి. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మర్డర్ సినిమా తెరకెక్కించిన వర్మ.. దళితుల మనోభావాలను రెచ్చగోడుతున్నాడని వారు ఆరోపిస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నేతలు ఆన్‌లైన్ లో డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కాగా, ఇటీవల ఇదే వ్యవహారంపై ఏపీలోని రాజోలు పోలీస్ స్టేషన్‌లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed