ప్రభుత్వానికి ప్రజలకు వారథి ‘జర్నలిజం’

by  |
ప్రభుత్వానికి ప్రజలకు వారథి ‘జర్నలిజం’
X

దిశ, రంగారెడ్డి : ప్రభుత్వానికి, ప్రజలకు వారథిగా పనిచేసే సాధనం జర్నలిజమని తెలంగాణ వర్కింగ్​ జర్నలిస్ట్​ ఫెడరేషన్​ జిల్లా అధ్యక్షుడు దేవేందర్​, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. షాద్​నగర్​ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గురువారం 2020 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నిత్యం ప్రజా సమస్యల్ని వెలుగులోకి తెచ్చేది జర్నలిస్ట్​లేనని వాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు లాకాకుల రమేష్, జిల్లా కోశాధికారి నర్సింహారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు నరేష్, మల్లేష్, సాయినాథ్, శ్రీను పాల్గొన్నారు.

Next Story

Most Viewed