ఉద్యమకారుని కి పట్టం.. ఆత్మ కమిటీ చైర్మన్ గా బావ్ సింగ్

by  |
ఉద్యమకారుని కి పట్టం.. ఆత్మ కమిటీ చైర్మన్ గా బావ్ సింగ్
X

దిశ , ఇల్లందు: ఇల్లందు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గా ఉద్యమకారుడైనా బావ్ సింగ్ ను ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మలిదశ ఉద్యమంలో బావ్ సింగ్ ఎంతో చురుకుగా పాల్గొన్నాడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేసి జైలు జీవితం సైతం అనుభవించాడని గుర్తుచేశారు. పార్టీని నమ్ముకుని ఉన్న వ్యక్తికి పార్టీ ఏనాడు అన్యాయం చేయదని తెలిపారు. బావ్ సింగ్ ఆత్మ కమిటీ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు ఉద్యమకారులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు ఆయనను శాలువాలతో, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ హరి సింగ్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, రైతు సమన్వయ సమితి సభ్యులు పులిగండ్ల మాధవరావు, టీఆర్ఎస్ నాయకులు దేవి లాల్ నాయక్, డేరంగుల పోషం, సిలివేరి సత్యనారాయణ, శీలం రమేష్, మేకల శ్యామ్, గుండా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Next Story