జగన్‌పై పురందేశ్వరి ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ట్విట్టర్ మాధ్యమంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ట్వీట్ చేస్తూ, విద్యుత్ టారిఫ్‌ను పెంచుతూ, స్లాబ్ రేటును 75 యూనిట్లకు తగ్గించడం వంటి నిర్ణయాలతో పేదలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయం కోసం దేవాదాయ భూములతో పాటు [&hellip;]</p>

జగన్‌పై పురందేశ్వరి ఆగ్రహం
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ట్విట్టర్ మాధ్యమంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ట్వీట్ చేస్తూ, విద్యుత్ టారిఫ్‌ను పెంచుతూ, స్లాబ్ రేటును 75 యూనిట్లకు తగ్గించడం వంటి నిర్ణయాలతో పేదలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయం కోసం దేవాదాయ భూములతో పాటు ప్రభుత్వ భూములను కూడా అమ్ముతున్నారని ఆమె సీఎం జగన్‌పై మండిపడ్డారు.

Next Story