- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, క్రైమ్ బ్యూరో : ఆర్థిక నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను ట్విట్టర్ ద్వారా స్వీకరిస్తామని సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎకనామిక్ అఫెన్సెస్ విభాగం ఇప్పటికే సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ను కలిగి ఉంది. అయితే, ఇటీవల ఆర్థిక నేరాల ద్వారా అమాయక ప్రజలు అత్యధికంగా మోసపోతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సీపీ సజ్జనార్ ఆదేశాలతో @EOWCyberabad ట్విట్టర్ ఖాతాకు ఫిర్యాదును పోస్టు చేయోచ్చన్నారు. అంతే కాకుండా, సంబంధిత విభాగం అధికారులతో డైరెక్ట్గా మాట్లాడి ఫిర్యాదు చేసేందుకు 94936 25553 నెంబరులో సంప్రదించాలన్నారు.
Next Story