పిల్లలపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలి : సజ్జనార్

by  |
పిల్లలపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలి : సజ్జనార్
X

దిశ, వెబ్‌డెస్క్: మిస్సింగ్ కేసులపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిస్సింగ్ కేసులపై ఎక్కువ దృష్టి పెడుతున్నామని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో నమోదవుతున్న కేసులన్నీ.. వ్యక్తిగత మనస్పర్థల వల్లే ఇంటినుంచి బయటకు వెళ్లిపోతున్నారని వెల్లడించారు. అంతేగాకుండా తల్లిదండ్రులతో గొడవపడి ఎక్కువమంది మైనర్లు వెళ్లిపోతున్నారని స్పష్టం చేశారు. మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే స్పెషల్ టీమ్స్‌తో చేధిస్తున్నామని అన్నారు. సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండటం మూలంగానే ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువ దృష్టిపెట్టాలని సీపీ సజ్జనార్ సూచించారు.

Next Story