లోన్ పేరుతో 30 వేలు కాజేసిన సైబర్​నేరగాళ్లు..

by  |
లోన్ పేరుతో 30 వేలు కాజేసిన సైబర్​నేరగాళ్లు..
X

దిశ, కూకట్​పల్లి: ఈ నెల 8వ తేదీన మహేందర్ (50) అనే వ్యక్తి ధని యాప్ నుంచి కాల్​ చేస్తున్నాము మీకు 75 వేల వరకు లోన్​ప్రీ అప్రూవల్ ​ఉందంటూ 9064868418 నెంబర్​ నుంచి కాల్​వచ్చింది. దీంతో మహేందర్ తనకు లోన్​కావాలని సమాధానం ఇచ్చారు. దీంతో మహేందర్​అకౌంట్​లో 7,400 రూపాయలు క్రెడిట్​అయ్యాయి. ఆశ్చర్యపోయిన మహేందర్ తనకు కాల్ వచ్చిన నెంబర్​కు ఫోన్​చేసి తనకు లోన్​వద్దు 75 వేలకు 7వేల 4 వందలు మాత్రమే వచ్చాయని చెప్పడంతో అవతలి వ్యక్తి లోన్​ క్యాన్సిల్​చేయడానికి మీ నెంబర్ ​కు ఓటిపి(OTP) వస్తుంది అది చెప్పండి అన్నడు.

దీంతో మహేందర్​ఏమి ఆలోచించకుండా తనకు వచ్చిన ఓటిపి ని సదరు వ్యక్తికి చెప్పాడు. ఓటీపీ చెప్పిన కొద్ది సేపటికి 7 వేలు, 5 వేలు ఇలా రోజు కొంత మొత్తం మహేందర్​అకౌంట్ నుంచి 30 వేల రూపాయల వరకు డెబిట్​అయ్యాయి. అంతే కాకుండా తనకు ముందు వచ్చిన నెంబర్​ తో పాటు మరో నంబర్​నుండి కాల్ వస్తుండటంతో తన క్రెడిట్ ​కార్డు ను బ్లాక్​ చేయించారు. తాను మోసపోయానని భావించిన మహేందర్ ​బాలానగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వహీదుద్దిన్​ తెలిపారు.

ఇదిలా ఉండగా బాలానగర్ రామ్​రెడ్డి నగర్​కు చెందిన సురుకొంటి శ్రీనివాస్​(35) హెచ్​డీ ఎఫ్​సి అకౌంట్​నుంచి ఈ నెల 20వ తేదీన 3,999 రూపాయలు కట్​అయినట్టు మెసేజ్​వచ్చింది. అదే రోజు మధ్యాహ్నం 1:20 గంటల ప్రాంతంలో శ్రీనివాస్​ అమెజాన్ ​యాప్​ద్వారా వాషింగ్​ మిషన్ ​బాల్స్​కొనుగోలు చేసి తన కార్డు ద్వారా డబ్బులు చెల్లించాడు. అమెజాన్​ ద్వారా కొనుగోలు చేసిన తరువాత తన అకౌంట్​నుంచి డబ్బులు మాయమయ్యాయని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాలానగర్​పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న బాలానగర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story