- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. హోటల్ యజమానిని కత్తితో పొడిచిన కస్టమర్లు
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: అర్ధరాత్రి మద్యం మత్తులో ఇద్దరు యువకులు హోటల్ లో యజమానితో ఘర్షణకు దిగారు. అడ్డువచ్చిన సిబ్బందిపై దాడి చేశారు. అనంతరం యజమానిని కత్తితో పొడిచారు. ఈ సంఘటన శనివారం రాత్రి ఆర్మూర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆర్మూర్ పట్టణానికి చెందిన లకన్, కార్తీక్ అనే ఇద్దరు యువకులు ఆర్మూర్ పట్టణంలోని మండి 95 హోటల్ లో భోజనం చేసేందుకు వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న యువకులు బిల్లు చెల్లించే విషయంలో […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: అర్ధరాత్రి మద్యం మత్తులో ఇద్దరు యువకులు హోటల్ లో యజమానితో ఘర్షణకు దిగారు. అడ్డువచ్చిన సిబ్బందిపై దాడి చేశారు. అనంతరం యజమానిని కత్తితో పొడిచారు. ఈ సంఘటన శనివారం రాత్రి ఆర్మూర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆర్మూర్ పట్టణానికి చెందిన లకన్, కార్తీక్ అనే ఇద్దరు యువకులు ఆర్మూర్ పట్టణంలోని మండి 95 హోటల్ లో భోజనం చేసేందుకు వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న యువకులు బిల్లు చెల్లించే విషయంలో ఘర్షణకు దిగారు. యజమాని ప్రపుల్ పై కత్తితో దాడి చేశారు. అడ్డు వచ్చిన ఇద్దరు హోటల్ సిబ్బందిని చితకబాదారు. స్థానికులు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
Next Story






