స్కూటీపై కూలిన విద్యుత్ స్తంభం

by  |
స్కూటీపై కూలిన విద్యుత్ స్తంభం
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కరెంట్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. తాజాగా మైలార్ దేవుపల్లి డివిజన్ పరిధిలోని మార్కెండేయ నగర్‌లో జనవాసాలపై స్తంభం కూలింది. గతంలో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదు. ఓ ఇంటి యజమాని తన ఇంట్లోని చెట్లకు కరెంట్ తీగలు తగులుతున్నాయని చెట్టు కొమ్మలు నరికే క్రమంలో స్తంభం కాస్త కొమ్మలు నరికిన యజమాని ఇంట్లో పడింది. ఈ ప్రమాదంలో స్కూటీ ధ్వంసం అయింది. ఇంటి యజమాని కుమార్తె నిహారిక (9)కు గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.



Next Story