- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,ఉత్తరాంధ్ర : అతనో నిరుపేద టైలర్. ఇంట్లో ఉన్నది మూడు లైట్లు, రెండు ఫ్యాన్లు మాత్రమే. ప్రతి నెలా రూ.200-300 మధ్యలో కరెంటు బిల్లు వస్తుంటుంది. కానీ ఈ నెలలో ఏకంగా రూ.90 వేలకు పైగా బిల్లు రావడంతో లబోదిబోమంటున్నాడు.
సీలేరు శివాలయం వీధికి చెందిన కిముడు సోమనాథమ్ ఓ రేకుల షెడ్డును అద్దెకు తీసుకుని టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మూడు లైట్లు, రెండు ఫ్యాన్లు, ఒక టీవీ మాత్రమే ఉన్నాయి. నెలకు రూ.200-300 వరకు కరెంటు బిల్లు వస్తుంటుంది. ఈ నేపథ్యంలో గత నెల 8నుంచి ఈ నెల 12వరకు వినియోగించిన విద్యుత్కి సంబంధించి ఆదివారం మీటర్ రీడింగ్ తీశారు. బిల్లు మొత్తం రూ.90,444 చెల్లించాలని వచ్చింది. దీనిని చూసి సోమనాథమ్ షాక్కు గురయ్యాడు. ఇంత భారీ మొత్తంలో బిల్లు ఎలా వచ్చిందని రీడింగ్ తీసిన వ్యక్తిని ప్రశ్నించాడు. ‘మీటర్లో ఉన్న రీడింగ్ ప్రకారమే బిల్లు ఇచ్చాను. అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈపీడీసీఎల్ అధికారులను సంప్రదించండి అని చెప్పి వెళ్లిపోయాడని సోమనాథమ్ వాపోయాడు.