అక్కడ నేటి నుంచి కర్ఫ్యూ

by  |
అక్కడ నేటి నుంచి కర్ఫ్యూ
X

డెహ్రాడూన్: ఉత్తరఖండ్‌లో కరోనా విజృంభిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా డెహ్రాడూన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికారులు వారం పాటు కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని రిషికేశ్, డెహ్రాడూన్, గర్హికాంట్, సెల్లీకాంట్ లల్లో నేడు ఉదయం 5 గంటల నుంచి మే 3వరకు కర్ఫ్యూ ఉంటుందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా హల్ద్వాని, లాల్ కున్, రామ్‌నగర్‌‌లో మంగళవారం నుంచి మే3 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed