- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో సీఆర్పీఎఫ్ బెటాలియన్లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఈస్ట్ ఢిల్లీ మయూర్ విహార్ ఫేజ్ 3లోని 31వ బెటాలియన్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పారామిలిటరీ ఫోర్స్ బెటాలియన్లో రెండు వారాల్లోనే 122 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, మరో 100 కేసుల ఫలితాలు విడుదల కావలసి ఉన్నది. దీంతో ఈ బెటాలియన్ను పూర్తిగా సీల్ చేశారు. ఈ బెటాలియన్లో కేసులు నమోదవడంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. బెటాలియన్లో కరోనా కట్టడి చర్యలపై సీఆర్పీఎఫ్ చీఫ్ను వివరణ కోరింది. సీఆర్పీఎఫ్కు చెందిన పారమెడిక్ యూనిట్లోని నర్సింగ్ అసిస్టెంట్ నుంచి జవాన్లకు ఈ వైరస్ సోకినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
tags: coronavirus, spread, containment, delhi, crpf, battalion, two weeks
Next Story