వడగండ్ల వాన భీభత్సం

by  |
వడగండ్ల వాన భీభత్సం
X

దిశ, మానకొండూరు: అకాల వర్షం జనజీవనాన్ని అతలాలకుతలం చేసింది. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం తిమ్మాపూర్, ఇందిరానగర్, రేణికుంట, నుస్తులాపూర్, మానకొండూరు మండలం పచ్చునూరు, ఊటూరు, దేవంపల్లి గ్రామాల్లో బుధవారం సాయత్రం వడగండ్ల వాన భీభత్సం సృష్టించింది. దీంతో కల్లాల్లో ధాన్యం తడిచిపోయాయి. అలాగే ఐకేపీ కేంద్రాల్లో అమ్మాకానికి తీసుకొచ్చిన ధాన్యం కూడా వర్షార్పణం అయ్యాయి. చేతికొచ్చిన పంటను అకాల వర్షం ముంచెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజులు అయితే పంట అమ్ముకునే వారమని, ఉన్నట్టుండి వర్షం కురివడంతో తాము తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.



Next Story

Most Viewed