నరహంతక జంట: భర్త 8 హత్యలు చేస్తే భార్య అంతకుమించి..

by  |
నరహంతక జంట: భర్త 8 హత్యలు చేస్తే భార్య అంతకుమించి..
X

దిశ, వెబ్‌డెస్క్: భార్యాభర్తలు అన్ని విషయాలలో కలిసే ఉండాలి. ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని ఈ భార్యాభర్తలు చాలా గట్టిగా నమ్మినట్టు ఉన్నారు. భర్త తప్పుచేస్తే దండించాల్సిది పోయి ఆమె కూడా భర్తతో కలిసి దారుణాలకు పాల్పడింది. అన్ని విషయాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలని హత్యలు చేయడంలో కూడా ఒకరికొకరు తోడుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే భర్త కన్నా భార్య ఒకడుగు ముందే ఉంది. భర్త 8 హత్యలు చేస్తే భార్య ఏకంగా 11 హత్యలు చేసింది. ఎందుకు వారేమైనా సైకో లా అంటే కాదు.. బంగారంపై మోజు. ఈజీ మనీ కోసం ఆ దంపతులు మొత్తం 19 మందిని హతమార్చారు. చివరికి పోలీసుల చేతికి చిక్కారు. దుండిగల్‌లో వరుస హత్యల కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. బంగారం కోసం ఒంటరి మహిళలను దారికాచి హత్య చేస్తున్న క్రూర దంపతుల కేసు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.

వివరాలలోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన స్వామి(27), ఆమె భార్య(26) ఈజీ మనీ కి అలవాటు పడ్డారు. దీని కోసం వారు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలకు మాయమాటలు చెప్పి, వారిని నమ్మించి జిన్నారం అడవుల్లోకి తీసుకు వెళ్తారు. అక్కడ వారి దగ్గరనుంచి డబ్బు, బంగారం లాక్కొని కిరాతకంగా హత్యచేస్తారు. ఈ విధంగా భార్యాభర్తలిద్దరూ బంగారం కోసం 15 మందికి పైగా మహిళలను హత్య చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈనెల 25న మల్లంపేటలోని కూలీ అడ్డా నుండి భామిని(35)అనే మహిళను జిన్నారం అడవుల్లోకి తీసుకెళ్లి భార్యాభర్తలు హత్యచేశారు. స్వామిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకోని తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం, డబ్బు కోసమే 15 మందికి పైగా మహిళలను హత్య చేసారని పోలీసులు తెలిపారు. భర్త 8 హత్యలు భార్య 11 హత్యలు చేసినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. త్వరలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతామని పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed