ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులే : ఆర్ఐ స్వర్ణలత

by  |
ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులే : ఆర్ఐ స్వర్ణలత
X

దిశ, జవహర్‌నగర్ : ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠినచర్యలు తప్పవని ఆర్ఐ స్వర్ణలత హెచ్చరించారు. సోమవారం తహసీల్దార్ అనిత ఆదేశాల మేరకు జవహర్‌నగర్ పరిధిలోని సర్వే నంబర్ 474, 696లోని శివానగర్, సీపీఐ కాలనీ, సంతోష్‌నగర్ కాలనీలలో పలు అక్రమ నిర్మాణాలు అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా ఆర్ఐ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే క్రిమినల్ కేసు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ప్రభుత్వ భూములను నోటరీ ద్వారా కొని మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు, వీఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


Next Story

Most Viewed