విషాదం.. భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి

by Disha Web Desk 12 |
విషాదం.. భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి
X

దిశ, శేరిలింగంపల్లి: నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై నుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన శుక్రవారం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎల్లమ్మబండ తులసి వనం ఫేస్ 2లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్‌లో పదోఅంతస్థులో పనిచేస్తున్న వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఉత్తమ్ విశ్వాస్ ( 34 ) అనే భవన నిర్మాణ కార్మికుడు పైనుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు. మృతుడు విశ్వాస్‌కు భార్య పిల్లలు ఉన్నట్లు తోటి కార్మికులు తెలిపారు.


Next Story