- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గణపతి నిమజ్జన యాత్రలో విషాదం..
by Batti.Sumithra |
ఆనందంగా సాగుతున్న వినాయకుని నిమజ్జనంలో అనుకోని అపశ్రుతి చోటుచేసుకుంది.

X
దిశ, మాక్లూర్ : ఆనందంగా సాగుతున్న వినాయకుని నిమజ్జనంలో అనుకోని అపశ్రుతి చోటుచేసుకుంది. నిమజ్జనం సాగుతున్న సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు అర్థరాత్రి దాటిన తర్వాత పడుకున్న వ్యక్తి తిరిగి లేవలేదు. ఈ ఘటన మనిక్ బండారు గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
పూర్తివివరాల్లోకెళితే ముత్యంపల్లి గ్రామానికి చెందిన మధు (27) నిమజ్జనానికి తీసుకెళ్లేందుకు తన ట్రాక్టర్ ను తీసుకుని డ్రైవర్ గా మనిక్ బండారు గ్రామానికి వచ్చాడు. మధ్యాహ్నం నుంచి మెల్లిగా సాగుతున్న శోభాయాత్ర బుధవారం ఉదయం వరకు నడిచింది. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి మధు మృతి చెందినట్లు నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది. మృతునికి భార్య, రెండు సంవత్సరాల కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై శంకర్ చెప్పారు.
Next Story






