అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన బస్సు.. 14 మంది మృతి

by Disha Web Desk 6 |
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన బస్సు.. 14 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: థాయ్‌లాండ్‌లోని ప్రచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 14 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయాలయిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం బస్సు అతివేగం వల్ల చెట్టును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో బస్సు శిథిలాల్లో చిక్కుకుని ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed