బుగ్గపాడులో యువకుడిపై కత్తితో దాడి

by Disha Web Desk 12 |
బుగ్గపాడులో యువకుడిపై కత్తితో దాడి
X

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి మండల పరిధిలోని బుగ్గపాడు గ్రామానికి చెందిన చిట్టిమాద దుర్గాప్రసాద్ 32 ను అదే గ్రామానికి చెందిన పరికల చెన్నారావు, పరికల శేఖర్ ,పరికల ధర్మారావులు కలిసి దుర్గాప్రసాద్ దంపతులు, కుమారుడు పై ఆదివారం రాత్రి కత్తితో దాడి చేశారు. దీంతో దుర్గాప్రసాద్ తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన అతను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఫిర్యాదు సేకరించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవడం లో జాప్యం చేస్తున్నారని దుర్గాప్రసాద్ బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక పోలీసులు స్పందించి దాడి చేసిన నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని విచారించి.. బాధితులకు తగిన న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు.

Next Story