డూటీకి వెళ్తున్నా అని చెప్పి వెళ్లి శవమై వచ్చాడు

by Sridhar Babu |   (  Updated:2024-08-15 15:10:27  IST  )

డూటీకి వెళ్తున్నా అని చెప్పి వెళ్లి శవమై వచ్చాడు. బైక్ నుండి పడి యువకుడు దుర్మరణం చెందాడు.

డూటీకి వెళ్తున్నా అని చెప్పి వెళ్లి శవమై వచ్చాడు
X

దిశ, మఠంపల్లి : డూటీకి వెళ్తున్నా అని చెప్పి వెళ్లి శవమై వచ్చాడు. బైక్ నుండి పడి యువకుడు దుర్మరణం చెందాడు. చౌటపల్లి గ్రామానికి చెందిన ఐతగాని నాగార్జున (34) మై హోం సిమెంట్ ఫ్యాక్టరీ లో వెల్డర్ గా పనిచేస్తున్నాడు. ఈయన ఈ నెల 13వ తేదీన డ్యూటి కి వెళ్తున్నా అని చెప్పి మళ్లీ ఇంటికి వెళ్లలేదు. గురువారం ఉదయం బక్కమంతులగూడెం గ్రామం శివారులో ఉన్న పల్లె ప్రకృతి వనం

వద్ద గాయాలై చనిపోయి ఉన్నాడు. గ్రామానికి చెందిన చెట్యాల వీరారెడ్డి గమనించి మృతుని తండ్రికి తెలిపాడు. మోటార్ సైకిల్ పై ప్రయాణించే సమయంలో ప్రమాదం జరగడం వలన గాయాలై చనిపోయినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎం. రామాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story