చైనాలో అగ్ని ప్రమాదం: 15 మంది మృతి

by Dishanational2 |
చైనాలో అగ్ని ప్రమాదం: 15 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనాలోని ఓ నివాస భవనంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరగగా 15 మంది మృతి చెందగా.. 44 మంది గాయపడ్డారు. తూర్పు చైనా యుహువాటై జిల్లాలోని నాన్జింగ్‌ నగరంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. బిల్టింగ్‌లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగి క్రమంగా వ్యాపించినట్టు వెల్లడించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. మంటలను ఆదుపులోకి తీసుకొచ్చేందుకు 25 ఫైర్ ఇంజన్లను మోహరించింది. గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తరలించగా.. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు నగర మేయర్ చెన్ జిచాంగ్ తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. మరోవైపు భవనం కాలిపోతున్నప్పుడు భారీగా ఎగిసిన మంటలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, చైనాలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు సర్వ సాధారణమయ్యాయి. ఇటీవల జరిగిన అనేక ప్రమాద ఘటనల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.


Next Story