Morocco Earthquake : ఘోర విషాదం.. మొరాకోలో 2800 దాటిన మృతుల సంఖ్య

by Malleboina Mahesh |   (  Updated:2023-09-12 05:15:52  IST  )

మొరాకోలో విధ్వంసకర భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 2800 దాటింది. భారీ భూకంపానికి పెద్ద పెద్ద భవనాలు పేకమేడలా నేల కూలిపోయాయి.

Morocco Earthquake : ఘోర విషాదం.. మొరాకోలో 2800 దాటిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: మొరాకోలో విధ్వంసకర భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 2800 దాటింది. భారీ భూకంపానికి పెద్ద పెద్ద భవనాలు పేకమేడలా నేల కూలిపోయాయి. దీంతో భవన శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. నిన్న సాయంత్రానికి 2600 మంది మృతి చెందినట్లు గుర్తించిన అధికారులు ఈ రోజు తెల్లవారుజామున ఆ సంఖ్య 2800కు పెరిగినట్లు తెలిపారు. అలాగే. 2,562 మంది తీవ్రంగా గాయపడ్డారు.. అందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. దీంతో మృతుల సంఖ్య నానాటికీ పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఓ నివేదిక ప్రకారం ఈ భూకంపం కారణంగా మృతుల సంఖ్య 3500 చేరుతుందని అంచనా వేశారు.

Next Story