BREAKING: వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్‌తో భార్యాభర్తలు దుర్మరణం

by Disha Web Desk 1 |
BREAKING: వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్‌తో భార్యాభర్తలు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్/బొంరాస్‌పేట్: వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండల పరిధిలోని బురాన్‌పూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బోయిని లక్ష్మణ్, లక్ష్మి భార్యభర్తలు. గ్రామానికి చెందిన బోయిని లక్ష్మణ్ (45), లక్ష్మి (40)దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఉదయం లక్ష్మణ్, లక్ష్మి ఉతికిన బట్టలను ఇంటి బయట రేకుల కింద ఉన్న తీగపై ఆరేయబోతుండగా.. ప్రమాదవశాత్తు తీగకు విద్యుత్ సరఫరా కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

అనుకోని ప్రమాదంలో భార్యభర్తలు మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. లక్ష్మణ్, లక్ష్మి దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు ఇటీవలే వివాహం కాగా, కొడుకు సిద్ధార్థ్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై రవూఫ్, పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతులను పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకునిదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవూఫ్ తెలిపారు.


Next Story

Most Viewed