BREAKING: కుత్బుల్లాపూర్‌లో పోలీసుల తనిఖీలు.. రూ.2.31 కోట్ల విలువైన స్పిరిట్ సీజ్

by Disha Web Desk 1 |
BREAKING: కుత్బుల్లాపూర్‌లో పోలీసుల తనిఖీలు.. రూ.2.31 కోట్ల విలువైన స్పిరిట్ సీజ్
X

దిశ, పేట్ బషీరాబాద్: లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సరిహద్దులతో పాటు ప్రధాన చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నేతలు ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర వుస్తువలతో ప్రలోభాలకు గురి చేయకుండా రాత్రింబవళ్లు పకడ్బందీగా పహారా కాస్తున్నారు. పోలింగ్‌కు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇవాళ కుత్బుల్లాపూర్‌లో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.2.31 కోట్ల విలువైన స్పిరిట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరి నిందితులపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed