BREAKING: మిర్యాలగూడలో పోలీసుల తనిఖీలు.. రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారం స్వాధీనం

by Disha Web Desk 1 |
BREAKING: మిర్యాలగూడలో పోలీసుల తనిఖీలు.. రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారం స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో పోలీసులు రాష్ట్ర సరిహద్దులతో పాటు వివిధ చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఓటర్లను డబ్బుతో ఏ విధమైన ప్రలోభాలకు గురి చేయకుండా పకడ్బందీగా పహారా కాస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మిర్యాలగూడ టౌన్‌లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే మిర్యాల‌గూడ నుంచి కోదాడ వెళ్తున్న ఓ బొలెరో వాహనంలో తరలిస్తున్న రూ.5.73 కోట్లు విలువ చేసే 13 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Next Story