- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
Breaking: ఛత్తీస్ఘడ్లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి, భారీగా ఆయుధాలు స్వాధీనం
by Shiva |
X
దిశ, వెబ్డెస్క్: ఛత్తీస్ఘడ్ రాష్ట్రం నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నేతల సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని రౌండప్ చేశాయి. ఈ క్రమంలో ఇంద్రావతి ఏరియా కమిటీ, నారాయణపూర్, దంతెవాడ, బస్తర్ జిల్లాలకు చెందిన డీఆర్జీ, బస్తర్ ఫైటర్లతో పాటు ఎస్టీఎఫ్ బృందాలతో మావోయిస్టులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పుల మోత మోగింది. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో కొందరు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నట్లుగా సమాచారం. ఎన్కౌంటర్లో భాగంగా భద్రతా దళాలు ఘటనా ప్రాంతంలో భారీగా ఆయుధాలు, విప్లవ సహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Next Story