- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING: రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ సీజ్.. నలుగురు డ్రగ్స్ పెడ్లర్స్ అరెస్ట్
దిశ, వెబ్డెస్క్: నగరంలో డ్రగ్స్, గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు పోలీసు శాఖ నడుం బిగించింది. ఈ మేరకు సిటీల్లోని ప్రధాన కూడళ్లు, చెక్పోస్టులు, పబ్బులు, క్లబ్బుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట పోలీసులు డ్రగ్స్, గంజాయిని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ డ్రగ్స్ తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ ఎస్వోటీ, పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. నగరంలో వివిధ ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ముఠా, కస్టమర్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ మేరకు వారి నుంచి 1.5 కేజీల ఓపీఎం, 24 గ్రాముల హెరాయిన్, 5 కేజీల మేర పోపీస్ట్రా డ్రగ్స్ పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నలుగురు డ్రగ్ పెడ్లర్స్, ముగ్గురు కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.