BREAKING: రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ సీజ్.. నలుగురు డ్రగ్స్ పెడ్లర్స్ అరెస్ట్

by Disha Web Desk 1 |
BREAKING: రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ సీజ్.. నలుగురు డ్రగ్స్ పెడ్లర్స్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో డ్రగ్స్, గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు పోలీసు శాఖ నడుం బిగించింది. ఈ మేరకు సిటీల్లోని ప్రధాన కూడళ్లు, చెక్‌పోస్టులు, పబ్బులు, క్లబ్బుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట పోలీసులు డ్రగ్స్, గంజాయిని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ డ్రగ్స్ తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ ఎస్‌వో‌టీ, పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. నగరంలో వివిధ ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ముఠా, కస్టమర్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ మేరకు వారి నుంచి 1.5 కేజీల ఓపీఎం, 24 గ్రాముల హెరాయిన్, 5 కేజీల మేర పోపీస్ట్రా డ్రగ్స్ పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నలుగురు డ్రగ్ పెడ్లర్స్, ముగ్గురు కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



Next Story

Most Viewed