బ్రేకింగ్ : స్టార్ హీరోయిన్‌కు ఈడీ నోటీసులు

by Disha Web Desk 4 |
బ్రేకింగ్ : స్టార్ హీరోయిన్‌కు ఈడీ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: మహాదేవ్ క్రికెట్ బెట్టింగ్ యాప్ కేసు బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఈ కేసులో గురువారం ఈడీ హుమ ఖరేషీ, హీనా ఖాన్, కపిల్ శర్మకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఇక, హుమ ఖురేషీ, హీనా ఖాన్, కపిల్ శర్మలు దుబాయ్ లో మహదేవ్ బెట్టింగ్ యాప్ ను ప్రచారం చేయడంతో పాటు, యాప్ సక్సెస్ పార్టీకి హాజరైనట్లు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

రణ్ బీర్ రెండు వారాల్లోగా ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. బెట్టింగ్ యాప్ ప్రచారానికి తీసుకున్న డబ్బుల విషయంలో కుదిరిన ఒప్పందాలపై ఈడీ ఫోకస్ చేసింది. ఈ మనీ లాండరింగ్ కేసులో 100 మంది సినీ ప్రముఖలు, ఇన్ ఫ్ల్యూయెన్సర్లు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. మహదేవ్ బుక్ యాప్ ఆన్ లైన్ లో పోకర్, కార్డ్ గేమ్స్, ఛాన్స్ గేమ్స్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్ బాల్, క్రికెట్ లలో అక్రమంగా బెట్టింగ్ లను నిర్వహిస్తోందని ఈడీ తెలిపింది. దుబాయ్‌లో బెట్టింగ్ లీగల్ కావున నిర్వాహకుడు సౌరభ్, రవి ఉప్పల్ అక్కడి నుంచే ఈ యాప్ ను నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది.

Read More..

సెక్సీగా ఉండటానికి శరీరం కాదు అది కూడా ఉండాలంటూ అషు రెడ్డి బోల్డ్ కామెంట్స్..! పోస్ట్ వైరల్



Next Story

Most Viewed