- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Big Breaking: రాచకొండ పోలీసుల దాడిలో భారీగా గంజాయి లభ్యం
ఎన్నికల వేళ పోలీసులు చెక్ పోస్టులు పెట్టి కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నారు.

X
దిశ, రాచకొండ : ఎన్నికల వేళ పోలీసులు చెక్ పోస్టులు పెట్టి కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నారు. అయినా ఏ మాత్రం భయం లేని కేటుగాళ్లు తమ అక్రమ సంపాదనను వదులుకోవడం లేదు. పోలీసుల కళ్లుగప్పి గంజాయిని అంతర్ రాష్ట్రాలకు సరఫరా చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. తాజాగా రాచకొండ పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ కంటైనర్లో 710 కేజీల గంజాయిని ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా రాచకొండ ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్లో పట్టుకున్నారు. కంటైనర్తోపాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై రాచకొండ పోలీసులు మరికొద్ది సేపట్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
Next Story






