అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి: తల్లి ట్వీట్ చేసిన కాసేపటికే విషాదం

by Dishanational2 |
అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి: తల్లి ట్వీట్ చేసిన కాసేపటికే విషాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి చెందాడు. ఫర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య మరణించినట్టు అధికారులు వెల్లడించారు. వెస్ట్ లాఫాయెట్‌లోని 500 అల్లిసన్ రోడ్‌లో మృతదేహాన్ని కనుగొన్నట్టు తెలిపారు. అయితే ఆదివారం తన తల్లి గౌరీ ఆచార్య ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘మా కొడుకు నీల్ యూఎస్ లోని ఫర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్నాడు. జనవరి 28 నుంచి కనిపించడం లేదు. ఎవరిని అడిగినా సమాచారం చెప్పడం లేదు. ఎవరికైనా తెలిస్తే సహాయం చేయండి’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే నీల్ ఆచార్య మరణించడం గమనార్హం. నీల్ మృతికి గల కారణాలను వెల్లడించలేదు. అమెరికాకు వెళ్లడానికి ముందు నీల్ మహారాష్ట్రలోని పూణెలో పాఠశాల విద్య పూర్తి చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవలే జార్జియాలోని లిథోనియాలో భారత విద్యార్థిని ఓ వ్యక్తి సుత్తితో కొట్టి చంపిన విషయం తెలిసిందే.

Next Story