కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా.. పది మందికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

by Shiva Kumar |
కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా.. పది మందికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
X

దిశ, అయిజ: కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా అయిజా పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాలమ్మపేటకు చెందిన సుమారు 30 మంది కూలీలు ఉదయం పనికోసం ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో ఆటో కట్టకింద తిమ్మప్ప స్వామి ఆలయం వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గమనించిన స్థానికులు గాయపడిన కూలీలను చికిత్స నిమిత్సం సమీప ఆసుపత్రికి తరలించారు. నిబంధనలు అతిక్రమించి కొందరు ఆటోల డ్రైవర్లు తమ సామర్థ్యానికి మించి కూలీలను ఆటోల్లో ఎక్కించుకు వెళ్తున్నారు. వారి ర్యాస్ డ్రైవింగ్ వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయని పట్టణవాసులు ఆరోపిస్తున్నరు. ఇలా బాధ్యత లేకుండా డ్రైవింగ్ చేస్తున్న ఆటో డ్రైవర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.



Next Story

Most Viewed