మరో దారుణం.. హైదరాబాద్‌లో మహిళపై అత్యాచారం.. హత్య!

by Disha Web Desk 19 |
మరో దారుణం.. హైదరాబాద్‌లో మహిళపై అత్యాచారం.. హత్య!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో దారుణం జరిగింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళపై అత్యాచారం చేసి అనంతరం బండరాయితో మోది దుండగులు కిరాతకంగా హత్య చేసినట్లు ఘటన స్థలంలో ఆనవాళ్లు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కాగా, మృతురాలిని గౌలిదొడ్డిలోని కేశవనగర్‌కు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. నిర్మాణంలో ఉన్న ఈ భవనంలోకి మృతురాలు వేస్ట్ మెటీరియల్ తెచ్చుకునేందుకు వెళ్లినట్లు సమాచారం. ఈ నెల 25 నుండి మహిళ కనబడటం లేదని పీఎస్‌లో మిస్సింగ్ కేస్ నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story