- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పెళ్లికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..రాజస్థాన్లో 9 మంది మృతి
దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 9 మంది మరణించారు. రాజస్థాన్లోని ఝలావర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..10 మందితో కూడిన బృందం వ్యానులో మధ్యప్రదేశ్లోని ఖిల్చిపూర్లో వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్లోని ఝలావర్ జిల్లా అక్లెరా పోలీస్ స్టేషన్ పరిధిలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పతికి తరలించగా పరిస్థితి విషమించి మరో ఆరుగురు మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి కూడా సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతులంతా రాజస్థాన్లోని దుంగార్గావ్కు చెందిన వారిగా గుర్తించారు.