Himachal Pradesh : నేలకూలిన శివాలయం.. 9 మంది మృతి.. శిథిలాల కింద మరో 50 మంది..!

by Disha Web Desk 19 |
Himachal Pradesh :  నేలకూలిన శివాలయం.. 9 మంది మృతి.. శిథిలాల కింద మరో 50 మంది..!
X

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల ధాటికి హిమాచల్ రాజధాని సిమ్లాలో శివాలయం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడకక్కడే మృతి చెందగా మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద సమయంలో ఆలయంలో దాదాపు 60 మంది ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద దాదాపు 50 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు సహయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ స్పందించారు. సహయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed