తీవ్ర విషాదం.. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి

by Disha Web Desk 4 |
తీవ్ర విషాదం.. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కల్తీ మద్యం తాగి 19 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంబాలా జిల్లాలోని పలు షాపులకు కల్తీ మద్యం సరఫరా కాగా తాగిన 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ నేత, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నేత కుమారుడితో పాటు మరో ఐదుగురు ఉన్నారు. ఈ ఘటనపై స్పందించిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కల్తీ మద్యాన్ని అరికట్టడంలో పూర్తిగా విఫలం అయ్యారని ఫైర్ అయ్యాయి.



Next Story

Most Viewed