విద్యుత్ వైర్ మీదపడి యువకుడు మృతి

by Disha Web Desk 20 |
విద్యుత్ వైర్ మీదపడి యువకుడు మృతి
X

దిశ, గరిడేపల్లి : కరెంట్ షాక్ తో యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామంలో జరిగింది. స్థానిక ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన కందుకూరి గోపమ్మ బతుకుదెరువు నిమిత్తం గరిడేపల్లి మండలం సర్వారం గ్రామంలో కథలు చెప్పడానికి వచ్చి ఊరి చివర వ్యవసాయ పొలంలో గుడిసె వేసుకొని నివసిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో వారి గుడిసెలో కరెంట్ లేకపోవడంతో ఆమె కుమారుడు కందుకూరి వీరయ్య (17) గుడిసె పక్కన ఉన్న రావిచెట్టు ఎక్కి కరెంట్ వైరును కర్రతో సరి చేస్తున్నాడు.

ప్రమాదవశాత్తు కరెంట్ వైరు నుండి షాక్ తగిలి చెట్టుపై నుండి కింద పడ్డాడు. అదే వైర్లు మృతుని మీద పడడంతో మృతునికి పలు చోట్ల కరెంట్ షాక్ తగిలింది. అది గమనించిన స్థానికులు కొన ఊపిరితో ఉన్న యువకున్ని హుజూర్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు ఆటొలో తరలించగా డాక్టర్ పరిశీలించి అప్పటికే మృతి చెందినాడని తెలిపారు. మృతుని తల్లి కందుకూరి గోపమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామని ఎస్సై పి.వెంకట్ రెడ్డి తెలిపారు. మృతునికి ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు కలరు.


Next Story

Most Viewed