- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువకుడి మృతి కలకలం.. హత్య చేసి ఉంటారని అనుమానం..?
అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో విషాదాన్ని నింపింది.

దిశ, నేరడిగొండ: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుగ్గారం గ్రామానికి చెందిన నాథరి సతీష్ (23) గత బుధవారం పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. మూడు రోజులుగా కుటుంబ సభ్యులు, బంధువులు గాలించినా అతడి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో శుక్రవారం బోత్ మండలంలోని కరత్వాడ చెరువులో ఓ మృతదేహం తేలినట్లు సమాచారం అందడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని పరిశీలించగా అది సతీష్దేనని గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని బోత్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబానికి ఒక్కగానొక్క కుమారుడైన సతీష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి రోదనలు హృదయ విదారకంగా మారాయి. యువకుడి మృతికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.






