వడదెబ్బ తగిలి యువకుడు మృతి..

by Taduka Kalyani |

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని శాంతినగర్ గ్యారేజ్ ఏరియా కి చెందిన బండవరం ప్రశాంత్ (30) ఎండ దెబ్బ తగలడంతో ఇంట్లోనే మృతి చెందాడు.

వడదెబ్బ తగిలి యువకుడు మృతి..
X

దిశ, మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని శాంతినగర్ గ్యారేజ్ ఏరియా కి చెందిన బండవరం ప్రశాంత్ (30) ఎండ దెబ్బ తగలడంతో ఇంట్లోనే మృతి చెందాడు. మృతుడు ప్రశాంత్‌కు భార్యతో పాటు ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. పిల్లలు ఇద్దరు చిన్నారులు కావడంతో ఈ ఘటన చూసినవారందరూ కన్నీటి పర్యంతమయ్యారు . మృతుడు మందమర్రి మండలం మామిడిగూడెం( లంబాడి తండ) గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో పూజారి గా ఉన్నాడు. మృతుని కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రశాంత్ ఆకస్మిక మృతి బంధువులు, స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇటీవల పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Next Story