కరెంట్ షాక్ తో మహిళ మృతి..

by Disha Web Desk 20 |
కరెంట్ షాక్ తో మహిళ మృతి..
X

దిశ, గుడిహత్నూర్ : మండలంలోని కొల్హారి గ్రామంలో కరెంట్ షాక్ తో ఓ మహిళ మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కొల్హారి గ్రామానికి చెందిన తగ్రే సంగీత సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న కూలర్ పెట్టడానికి వెళ్లి కూలర్ ద్వారా కరెంటు సరఫరా అవ్వడంతో వీపు వెనుక భాగం పై బలమైన గాయం కావడంతో కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ పేర్కొన్నారు. మృతురాలికి తక్షణ సహాయం కింద విద్యుత్ శాఖ తరపున అంత్యక్రియల కోసం ఏఈ తాళ్లపల్లి గౌతమ్ పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.


Next Story

Most Viewed