అకౌంట్లో డబ్బులు మాయం..ఎలాగో తెలుసా..

by Disha Web Desk 20 |
అకౌంట్లో డబ్బులు మాయం..ఎలాగో తెలుసా..
X

దిశ, రాజంపేట : బ్యాంకు అధికారులం మాట్లాడుతున్నాం అంటూ, రాజంపేటకు చెందిన మహిళ బ్యాంకు అకౌంట్లో నుండి 29,999/- రూపాయలను సైబర్ నేరగాళ్ళు కాజేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం శనివారం కొందరు వ్యక్తులు రాజంపేటకు చెందిన మహిళకు, ఫోన్ చేసి మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీ చెప్పండి లేకపోతే, మీ బ్యాంకు అకౌంట్ క్లోజ్ అవుతుందని అన్నారు.

దీంతో మహిళ ఓటీపీ చెప్పగానే ఆమె బ్యాంకు ఖాతాలో నుండి 29,999/- రూపాయలు తీసినట్టు మెసేజ్ వచ్చింది. మెసేజ్ ని గమనించిన మహిళ మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే ఆమె బ్యాంకు ఖాతాను నిలిపివేయించి, ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై రాజు తెలిపారు.


Next Story