- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానంతో ఇంటినిండా సీసీ కెమెరాలు పెట్టించిన భర్త.. లైఫ్లో మర్చిపోలేని షాకిచ్చిన భార్య
పెళ్లయిన కేవలం 48 రోజులకే ఓ నవవధువు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘోర ఉదంతం ముంబై సమీపంలోని అంబర్నాథ్లో వెలుగుచూసింది.

దిశ, వెబ్డెస్క్: పెళ్లయిన కేవలం 48 రోజులకే ఓ నవవధువు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘోర ఉదంతం ముంబై సమీపంలోని అంబర్నాథ్లో వెలుగుచూసింది. భర్త, అత్తమామల శారీరక, మానసిక వేధింపులు తట్టుకోలేక 26 ఏళ్ల విశాఖ తిల్కర్ బలవన్మరణానికి పాల్పడింది. భార్య ప్రతీ కదలికను పసిగట్టేందుకు సదరు వైద్యుడైన భర్త ఇల్లంతా సీసీటీవీ కెమెరాలు అమర్చి, ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా హరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే..
బాధిత విశాఖకు, థానే జిల్లా అంబర్నాథ్కు చెందిన డాక్టర్ నితిన్ తిల్కర్కు ఈ ఏడాది ఏప్రిల్ 30న వివాహమైంది. పెళ్లికి ముందు అంతా సజావుగానే ఉన్నప్పటికీ, వివాహం ముగిసిన వెంటనే అత్తమామల అసలు స్వరూపం బయటపడింది. పెళ్లిలో తమకు ఆశించిన స్థాయిలో కట్నకానుకలు ఇవ్వలేదని, తగినంత మర్యాద దక్కలేదని భర్తతో పాటు అత్త, మరిది నినాద్లు విశాఖను వేధించడం ప్రారంభించారు. పుట్టింటి నుంచి అదనంగా డబ్బు, బంగారం తీసుకురావాలంటూ నిత్యం ఒత్తిడి చేశారు. దీనికి తోడు, భర్త నితిన్ ఆమెపై తీవ్రమైన అనుమానంతో ఇంటి లోపల, బయట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. విశాఖ ఎవరితోనైనా మాట్లాడితే చాలు.. తీవ్రంగా కొట్టేవాడని సమాచారం. వేధింపులు తాళలేక విశాఖ సూసైడ్ చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భర్త కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన నితిన్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, పరారీలో మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.






