నా శత్రువు వద్ద పని ఎందుకు చేసిండ్రు.. తల్లీ కొడుకులపై కత్తితో దాడి చేసిన వ్యక్తి

by Disha Web Desk 11 |
నా శత్రువు వద్ద పని ఎందుకు చేసిండ్రు.. తల్లీ కొడుకులపై కత్తితో దాడి చేసిన వ్యక్తి
X

దిశ, దంతాలపల్లి: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల పరిధి కుమ్మరి కుంట్ల గ్రామంలో దారుణ ఘటన జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలోజు సునీత, కుమారస్వామిలు భార్యభర్తలు. వడ్రంగి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కుమారస్వామి అదే గ్రామానికి చెందిన ఏరుకొండ ప్రవీణ్ ఇంటికి రేకులు పిటింగ్ చేశాడు. కాగా ఏరుకొండ ప్రవీణ్ కు ఏరుకొండ నరేష్ కు మధ్య గతంలో గొడవలు జరిగాయి. అయితే తాను గొడవపడిన వ్యక్తి అయిన ప్రవీణ్ ఇంటికి రేకులు పిటింగ్ చేస్తారా అంటూ కుమారస్వామిని చంపేందుకు నరేష్ కుమారస్వామి ఇంటికి వెళ్లాడు.

ఆ సమయంలో కుమారస్వామి అందుబాటులో లేకపోవడంతో అతని భార్య అయిన పోలోజు సునీతపై కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన సునీత కొడుకు పోలోజు ఏకాంబరంపై కూడా నరేష్ దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలైన బాధితురాలుని గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed