ఖలిస్తాన్ ఏర్పాటువాది అమృత్ పాల్ సింగ్ అరెస్ట్

by Dishafeatures2 |
ఖలిస్తాన్ ఏర్పాటువాది అమృత్ పాల్ సింగ్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఖలిస్తాన్ ఏర్పాటువాది, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. పంజాబ్ లోని మోగా జిల్లాలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మార్చి 18 నుంచి అమృత్ పాల్ సింగ్ పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి పంజాబ్ పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు. అయితే పలు రకాల వేశాలు మారుస్తూ అమృత్ పాల్ సింగ్ పోలీసుల నుంచి తప్పించుకుతిరుగుతున్నాడు. అయితే ఆయన కోసం గాలింపును ముమ్మరం చేసిన పోలీసులు.. మొదట ఆయన కుటుంబ సభ్యులను, అనుచరులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారి నుంచి విలువైన సమాచారం రాబట్టిన పోలీసులు ఎట్టకేలకు అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేశారు.

Next Story

Most Viewed