- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవత్వం మంట కలిసిన వేళ.. తక్కువ కులం అని శవాన్ని పూడ్చిపెట్టనివ్వని గ్రామస్థులు!
ఏపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా పెడనలో తక్కువ కులానికి చెందినవాడని గ్రామస్తులు గ్రామంలో అంత్యక్రియలనే నిర్వహించనివ్వలేదు. గ్రామంలో 7 స్మశానవాటికలు ఉన్నా శవం పూడ్చి పెట్టడానికి కనీసం ఆరడుగుల జాగను కూడా ఇవ్వలేదు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా పెడనలో తక్కువ కులానికి చెందినవాడని గ్రామస్తులు గ్రామంలో అంత్యక్రియలనే నిర్వహించనివ్వలేదు. గ్రామంలో 7 స్మశానవాటికలు ఉన్నా శవం పూడ్చి పెట్టడానికి కనీసం ఆరడుగుల జాగను కూడా ఇవ్వలేదు. దీంతో అధికారులు వచ్చి గ్రామస్థులతో మాట్లాడారు. స్మశానవాటికలో స్థలాన్ని ఇవ్వాలని కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఈ క్రమంలో రెండు రోజుల పాటు శవం దగ్గరే కుటుంబ సభ్యులు జాగారం చేస్తూ కన్నీరుమున్నీరయ్యారు. శవం పూడ్చిపెట్టడానికి స్థలం ఇవ్వాలని వేడుకున్నారు. అయినా గ్రామస్థులు కనికరించలేదు. ఈ క్రమంలో ఓ రైతు తన పొలంలో అంత్యక్రియలు చేసుకుకోవాలని అనుమతివ్వడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద రోదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో గ్రామస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.






