గుర్తు తెలియని వ్యక్తి మృతి

by Taduka Kalyani |

గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

గుర్తు తెలియని వ్యక్తి మృతి
X

దిశ, చైతన్యపురి : గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇన్స్ పెక్టర్ కే. వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్బీనగర్ పరిధిలోని ఓంకార్ నగర్ బస్టాండ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గమనించిన స్థానికులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ శేఖర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా మృతుడి వయస్సు సుమారు 60–65 ఏళ్లు ఉంటాయని, మృతుడి స్థానికంగా భిక్షాటన చేస్తూ తిరిగేవాడని గుర్తించామన్నారు. మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

Next Story