ప్రియుడి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రియురాలు ఆత్మహత్య..

by Disha Web Desk 11 |
ప్రియుడి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రియురాలు ఆత్మహత్య..
X

దిశ, గద్వాల: ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. గద్వాల టౌన్ ఎస్సై రామస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల పట్టణానికి చెందిన బోయ కురుమక్కకు నలుగురు కూతుళ్లు ఉండగా వారిలో ముగ్గురు వివాహాలు ఇప్పటికే అయ్యాయి. చివరి కూతురు రామేశ్వరి (22), ఆమె స్నేహితురాలు సంగీతతో కలిసి ఓ ఇంట్లో పని చేస్తున్నారు. గత కొంతకాలంగా ఇంటివారు హైదరాబాదులో ఉండడంతో ఇంటి వ్యవహారాలను అన్నింటిని రామేశ్వరి, సంగీత చూసుకునేవారు.

రామేశ్వరికి కర్నూలు పట్టడానికి చెందిన ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం ఉంది. కుటుంబ కలహాల వల్ల ఈ నెల 14వ తేదీన ఆ యువకుడు కర్నూల్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని రామేశ్వరి తన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై తెలిపారు.

Next Story

Most Viewed