రాష్ట్రంలో దారుణం.. భర్తను కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు భార్యలు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో దారుణం.. భర్తను కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు భార్యలు

రాష్ట్రంలో దారుణం.. భర్తను కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు భార్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్(Nizamabad) జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తను.. ఇద్దరు భార్యలు అతి కిరాతకంగా.. చిత్రహింసలకు గురిచేసి చంపారు. ఈ ఘటన దేవక్కపేట్‌లో సోమవారం సాయంత్రం జరిగింది. దేవక్కపేట్‌కు చెందిన మోహన్‌కు కవిత, సంగీత అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. ముగ్గురి మధ్య రోజూ గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ కూడా మరోసారి గొడవ జరగ్గా అది తీవ్రరూపం దాల్చింది. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేక.. ఇద్దరూ ఏకమై ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ మంటల్లో తీవ్ర గాయాలైన మోహన్‌ను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరణించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story