ఘోర రోడ్డుప్రమాదం.. లారీచక్రాల కింద నలిగి యువకులు దుర్మరణం

by Naga Rani Yarlagadda |

ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.

ఘోర రోడ్డుప్రమాదం.. లారీచక్రాల కింద నలిగి యువకులు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. జిల్లాలోని ఒంగోలు - చీమకుర్తి ప్రధాన రహదారిపో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మర్రిచెట్లపాలెం వద్ద ఓ గ్రానైట్ లారీ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ సహా లారీ కిందకు ఇద్దరు యువకులు వెళ్లిపోగా.. దాని చక్రాల కింద నలిగిపోయి స్పాట్ లోనే మరణించారు. ప్రమాద ఘటనతో ఆ రోడ్డు నెత్తరోడగా.. భీతావహంగా మారింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను లారీ కింది నుంచి తీసి పోస్టుమార్టమ్ నకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story