డ్రైవర్ నిర్లక్ష్యంతో శాతనకోటలో ఘోర ప్రమాదం.. మినుముల మిషన్ మీద పడి ఇద్దరు మృతి

by Dishafeatures2 |
డ్రైవర్ నిర్లక్ష్యంతో శాతనకోటలో ఘోర ప్రమాదం.. మినుముల మిషన్ మీద పడి ఇద్దరు మృతి
X

దిశ, నందికొట్కూర్: నంద్యాల జిల్లా నందికొ ట్కూరు మండల పరిధిలోని శాతన కోటలో గ్రామంలో మినుము పంట నూర్పిడి టాక్టర్ మిషన్ బోల్తా పడి నాగలక్ష్మి, అనురాధ ఇద్దరు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శాతనకోట గ్రామ మహిళలు మంగళవారం ఉదయం జక్కుల వెంకటస్వామి పొలానికి మినుము పంట నూర్పిడి పనులకు ఆరు మంది కూలీలు వెళ్ళారు. పని ముగించుకుని ఇంటికి ఏపీ 39 ఎంఎల్ 2510 నెంబర్ గల సోనాలిక ట్రాక్టర్ మీద ఎక్కి తిరుగు ప్రయాణంలో అల్లూరు, శాతన కోట పొలాల మధ్యలో అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు మిషన్ బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

మరో మహిళా కూలీ ఖాజాబీకి కాలు విరిగింది. ఇద్దరు మహిళలు మృతి సంఘటనతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న నందికొట్కూరు రూరల్ సిఐ సుధాకర్ రెడ్డి, బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై ఓబులేసు హుటాహుటిన వెళ్లి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ రమణను విచారించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఓబులేసు తెలిపారు. మృతురాలి బంధువులు కుటుంబ సభ్యులు పరశురాముడు, నరసింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలు అనురాధ కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరందరూ తొమ్మిది, ఐదు రెండు సంవత్సరాల చిన్నారులు. విషయం తెలుసుకున్న నియోజవర్గ ఎమ్మెల్యే ఆర్థర్ హుటాహుటిన నందికొట్కూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. అంత్యక్రియలకు ఆర్ధిక సహాయం అందించారు. మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Next Story