రోడ్డు ప్రమాదంలో ఒకరు అనుమానస్పద స్థితిలో మరొకరి మృతి !

by Disha Web Desk 12 |
రోడ్డు ప్రమాదంలో ఒకరు అనుమానస్పద స్థితిలో మరొకరి మృతి !
X

దిశ, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం పరిధిలోని సీరోల్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి,నర్సింహులపేట మండలంలో మరో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. వివరాల్లోకి వెళితే సీరోల్ మండలం కాంపల్లి శివారు బీల్యా నాయక్ తండాకు చెందిన బోడ రమేష్ (40) అనే వ్యక్తి బుధవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనం నడుపుకుంటూ వస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు కొండ్రెడ్డి అశోక రెడ్డి (45) అనే వ్యక్తి నర్సింహులపేట మండలంలోని చింతకుంట చెరువు లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed